సైబర్ వలలో చిక్కి రూ.12 లక్షలు కోల్పోయిన జనసేన ఎమ్మెల్యే

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఎమ్మెల్యే బాలరాజు రూ. 12 లక్షలు కోల్పోయిన వైనం అమరావతిలో కలకలం రేపుతోంది.

By -  Knakam Karthik
Published on : 22 March 2026 3:30 PM IST

Andrapradesh, Cyber Crime, MLA, Fraud Alert, Online Scam, RTA Challan

సైబర్ వలలో చిక్కి రూ.12 లక్షలు కోల్పోయిన జనసేన ఎమ్మెల్యే

అమరావతి: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఎమ్మెల్యే బాలరాజు రూ. 12 లక్షలు కోల్పోయిన వైనం అమరావతిలో కలకలం రేపుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఆర్టీఏ (RTA) చలానా చెల్లించాలంటూ ఎమ్మెల్యే వాట్సాప్‌కు ఒక సందేశం వచ్చింది. అందులోని లింక్‌ను క్లిక్ చేయగానే, ఆయన బ్యాంకు ఖాతా నుండి విడతల వారీగా మొత్తం రూ. 12 లక్షలు మాయమయ్యాయి.

తాను సైబర్ మోసానికి గురయ్యానని గుర్తించిన ఎమ్మెల్యే వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులను గుర్తించేందుకు మరియు పోగొట్టుకున్న సొమ్మును తిరిగి రాబట్టేందుకు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని ఈ సందర్భంగా అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

Next Story