2,569 మందికి కారుణ్య నియామకాలు: మంత్రి లోకేష్‌

కారుణ్య ప్రాతిపదికన ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని..

By -  అంజి
Published on : 20 Sept 2025 7:11 AM IST

Minister Nara Lokesh, Compassionate Teacher Appointments, APnews

2,569 మందికి కారుణ్య నియామకాలు: మంత్రి లోకేష్‌

అమరావతి: కారుణ్య ప్రాతిపదికన ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని విద్య మరియు ఐటీ శాఖ మంత్రి ఎన్. లోకేష్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద పోస్టింగులు ఇచ్చినట్టు మంత్రి నారా లోకేష్ తెలిపారు. శుక్రవారం నాడు ఏపీ శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్నీ బి.గోపిమూర్తి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

మొత్తం 3,411 మంది నియామకం కోసం దరఖాస్తు చేసుకున్నారని.. వారిలో 2569 మంది కారుణ్య నియామకాల కింద పోస్టింగులు ఇచ్చినట్టు వెల్లడించారు. ఇంకా 872 మందికి వసతి కల్పించాల్సి ఉందని అన్నారు. పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు, ఇతర సమస్యల కారణంగా కొన్ని నియామకాలు ఆలస్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు మరియు జిల్లా పరిషత్‌లు మరియు మండల పరిషత్‌లు వంటి స్థానిక సంస్థల పరిధిలోని వాటి మధ్య నిబంధనలు మారుతూ ఉన్నాయని, ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల స్కూళ్లకు ఇంకా ఏకీకృత సేవా నియమాలు లేవని ఆయన వివరించారు.

Next Story