జగన్ రూ.3,500 కోట్ల లిక్కర్ స్కామ్ చేశారు..మాణిక్కం ఠాగూర్ సంచలన ట్వీట్

ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్‌పై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ సంచలన ట్వీట్ చేశారు.

By Knakam Karthik
Published on : 23 Jun 2025 2:09 PM IST

Andrapradesh, former cm Ys Jagan, Congress Leader Manickam Tagore, Andrapradesh Liquor Scam

జగన్ రూ.3,500 కోట్ల లిక్కర్ స్కామ్ చేశారు..మాణిక్కం ఠాగూర్ సంచలన ట్వీట్

ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్‌పై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ సంచలన ట్వీట్ చేశారు. మాజీ సీఎం జగన్‌ రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం చేశారని ఆరోపించారు. దీన్ని శాస్త్రీయ అవినీతి మోడల్‌ అని ఎద్దేవా చేశారు. జగన్‌ మద్యం కుంభకోణం, విదేశాల్లో పెట్టుబడులు, కుట్ర కోణాలు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లను జగన్‌ క్యాష్‌ క్యారియర్లుగా వాడుకున్నారని మండిపడ్డారు. తాడేపల్లి, అమరావతిలోని ఫ్లాట్లలో కరెన్సీని బాక్సుల్లో దాచారన్నారు. మద్యం డబ్బుతో విదేశాల్లో లిక్కర్‌ ఫ్యాక్టరీలు నెలకొల్పారని తెలిపారు.

ఇక పని అయిపోయిన తర్వాత జగన్ గ్యాంగ్ సంబంధాలు తెంచేసుకుంది. కొందరికి హైదరాబాద్‌లో ఉద్యోగం, మిగిలినవారికి సైలెన్స్ మనీ, ఎలాంటి లింక్ ఉండకుండా శుభ్రమైన ఎగ్జిట్ ప్లాన్ చేసింది..అని మాణిక్కం ఠాగూర్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. దుబాయ్, టాంజానియా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాల్లో సమావేశాలు. అక్కడ మద్యం ఫ్యాక్టరీల ఏర్పాటుకు ప్రణాళిక. బ్లాక్ మనీని విదేశాల్లో పెట్టుబడిగా మారుస్తూ వ్యాపార సామ్రాజ్యం ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఐటీ, ఈడీ, పోలీసులు జాడ పట్టే లోపే విమాన ప్రయాణ ప్రణాళిక చేశారు..అని రాసుకొచ్చారు.

కాగా ఈ లిక్కర్ స్కామ్‌పై ప్రధాని మోదీ, అమిత్ షాఔ మౌనమే జగన్ రక్షణా? అంటూ మాణిక్కం ఠాగూర్ ఎక్స్‌లో ప్రశ్నించారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వ హయాంలో ఎంపీలు కేంద్రానికి మద్దతు ఇచ్చిన బిల్లులు గుర్తు చేశారు. ఆర్టికల్ 370, సీఏఏ, వ్యవసాయ చట్టాలు, రాజ్యసభ బిల్లులు..అని చెప్పుకొచ్చారు. దానికి ప్రతిఫలంగానే.. ఈడీ దాడులు లేవు, సీబీఐ నోటీసులు లేవు, ఐటీ దాడులు లేవు..అంటే ఢిల్లీ సారథ్యం జగన్‌ను రక్షించిందా?..అని మాణిక్కం ఠాగూర్ తన ఎక్స్‌లో రాసుకొచ్చారు.

Next Story