పెళ్లింట విషాదం.. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

Man dies in road accident after daughter's wedding in East Godavari. తూర్పుగోదావరిలోని మామిడుకుదురు గ్రామంలోని పాశర్లపూడిలంక గ్రామానికి చెందిన తన కుమార్తెకు

By అంజి  Published on  13 Dec 2022 4:45 AM GMT
పెళ్లింట విషాదం.. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

తూర్పుగోదావరిలోని మామిడుకుదురు గ్రామంలోని పాశర్లపూడిలంక గ్రామానికి చెందిన తన కుమార్తెకు వివాహం చేసి ఫంక్షన్ హాల్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించిన విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వధువు తండ్రి ముత్యాల శ్రీనివాసరావు(51) కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. సోమవారం అతడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాశర్లపూడిలంకకు చెందిన ముత్యాల శ్రీనివాసరావు కుమార్తె వనదుర్గావల్లి శ్రావణి వివాహం ఈ నెల 8వ తేదీ రాత్రి పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి ఫంక్షన్ హాల్‌లో జరిగింది.

వివాహ వేడుకలు ముగించుకుని శ్రీనివాసరావు మోటార్ సైకిల్ పై ఇంటికి తిరిగి వస్తుండగా పాసరలపూడి కైకాలపేటలో 216వ నెంబరు జాతీయ రహదారిపై అదుపు తప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో జీజీహెచ్‌కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి చెందాడు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి భార్య మంగ, నూతన వధువు వనదుర్గావలి శ్రావణి, వారి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతుడి సోదరుడు వీరవెంకట సత్యనారాయణ ఫిర్యాదు మేరకు నగర హెచ్‌సి కొండబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story