జనసేన స్టార్ క్యాంపెయినర్లు వీరే..!

ఏపీలో ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు.

By Medi Samrat
Published on : 10 April 2024 7:00 PM IST

జనసేన స్టార్ క్యాంపెయినర్లు వీరే..!

ఏపీలో ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, క్రికెటర్ అంబటి రాయుడు ఈ లిస్టులో ఉన్నారు. ఇక టాలీవుడ్ కమెడియన్ పృథ్వీ, నటులు హైపర్ ఆది, గెటప్ శ్రీను, ప్రముఖ బుల్లితెర నటుడు 'మొగలిరేకులు' ఫేమ్ సాగర్, టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్టార్ క్యాంపెయినర్లుగా నియమితులయ్యారు.

"ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్థుల పక్షాన ఎన్నికల ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెయినర్లను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నియమించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుతోపాటు, అంబటి రాయుడు (క్రికెటర్), నృత్య దర్శకుడు జానీ, సినీ, టీవీ నటులు సాగర్, పృద్వి, హైపర్ ఆది, గెటప్ శ్రీను స్టార్ క్యాంపెయినర్లుగా నియమితులయ్యారు." అంటూ జనసేన పార్టీ నుండి అధికారిక ప్రకటన వచ్చింది. ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థుల తరఫున వీరు పలు ప్రాంతాల్లో ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు.

Next Story