నేడే పవన్‌ కల్యాణ్‌ 'వారాహి' యాత్ర ప్రారంభం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి బస్సు యాత్రను బుధవారం అన్నవరం నుంచి ప్రారంభించనున్నారు. పవన్‌ కల్యాణ్‌ ఉదయం 9

By అంజి
Published on : 14 Jun 2023 8:15 AM IST

Jana Sena, Pawan Kalyan, Varahi Bus Yatra, Annavaram

నేడే పవన్‌ కల్యాణ్‌ 'వారాహి' యాత్ర ప్రారంభం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి బస్సు యాత్రను బుధవారం అన్నవరం నుంచి ప్రారంభించనున్నారు. పవన్‌ కల్యాణ్‌ ఉదయం 9 గంటలకు అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ మూర్తిని దర్శించుకుని సాయంత్రం 4 గంటలకు యాత్రకు బయలుదేరుతారు. సాయంత్రం 5 గంటలకు కత్తిపూడిలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని, బస్సుయాత్ర సజావుగా సాగుతుందని ఆశిస్తున్నామన్నారు.

వారాహి బస్సు యాత్రలో క్రమశిక్షణ పాటించాలని, బైక్‌లకు ఉన్న సైలెన్సర్‌లను తొలగించవద్దని, ట్రాఫిక్‌కు ఎటువంటి అవరోధాలు కల్పించవద్దని ఆయన పార్టీ కార్యకర్తలను అభ్యర్థించారు. అనంతరం కాకినాడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎస్.సతీష్ కుమార్ యాత్ర, బహిరంగ సభలో ప్రజలు క్రమశిక్షణతో పాటు పోలీసులకు సహకరించాలని కోరారు. మంగళవారం సాయంత్రం, మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత తన ఎన్నికల ప్రచార వాహనం "వారాహి"కి ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం అన్నవరం నుంచి ఏపీలో తన పర్యటనను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.

Next Story