అక్టోబర్‌ 1 నుంచి విశాఖలో ఇన్ఫోసిస్‌ సేవలు

Infosys to start services in visakhapatnam on october 1 says Gudivada Amarnath. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్ అక్టోబర్ 1 నుంచి విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు

By అంజి
Published on : 27 Sept 2022 4:56 PM IST

అక్టోబర్‌ 1 నుంచి విశాఖలో ఇన్ఫోసిస్‌ సేవలు

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్ అక్టోబర్ 1 నుంచి విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. మంత్రి తన ట్వీట్‌లో.. 'ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ అక్టోబర్ 1 నుండి విశాఖపట్నంలో తన కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. 1,000 మంది ఉద్యోగుల సామర్థ్యంతో ప్రారంభించి, ఉద్యోగాలు క్రమంగా 3,000 కు విస్తరిస్తాయి. మరో ప్రముఖ ఐటీ కంపెనీ డల్లాస్ టెక్నాలజీస్ సెంటర్ కూడా విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.' అని వివరించారు.

అక్టోబర్ 1న విశాఖపట్నం మధురవాడ సెజ్‌లో కార్యకలాపాలు ప్రారంభించాలని ఇన్ఫోసిస్ నిర్ణయించింది. ప్రస్తుతం సెజ్‌లో పనిచేస్తున్నప్పటికీ, తర్వాత సొంత భవనాన్ని నిర్మించుకుంది. ప్రారంభంలో ఇన్ఫోసిస్ ఒక లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో యూనిట్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. మొదటి దశలో 1,000 మంది నిపుణులతో సేవలు ప్రారంభించనున్నారు. విశాఖపట్నంలో తమ యూనిట్ ఏర్పాటు చేసి 2,500-3000 మందితో సేవలు అందిస్తామని ఇన్ఫోసిస్ గ్లోబల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ హెడ్ నీలాద్రి ప్రసాద్ మిశ్రా, రీజనల్ హెడ్ అమోల్ కులకర్ణి తెలిపిన సంగతి తెలిసిందే.

Next Story