Andhrapradesh: బీఎల్వోలకు గుడ్‌న్యూస్‌.. త్వరలో గౌరవ వేతనాలు

మూడేళ్లుగా గౌరవ వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్న బీఎల్వోలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.

By అంజి
Published on : 31 Dec 2024 6:48 AM IST

Booth Level Officers, APnews, Honorary pay soon

Andhrapradesh: బీఎల్వోలకు గుడ్‌న్యూస్‌.. త్వరలో గౌరవ వేతనాలు

అమరావతి: మూడేళ్లుగా గౌరవ వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్న బీఎల్వోలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలోని 4,638 మంది బూత్‌ లెవల్‌ ఆఫీసర్లకు త్వరలో గౌరవ వేతనాలు అందనున్నాయి. 2021 - 22 నుంచి వేతనాలు అందక 26 జిల్లాల్లో బీఎల్‌వోలు ఇబ్బంది పడుతున్నట్టు రాష్ట్ర లోకాయుక్తకు ఫిర్యాదు అందింది. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన సోషల్‌ వర్కర్‌ జే.శ్రీనివాసగౌడు రాష్ట్ర లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించాలని సెప్టెంబర్‌ 27న ఉన్నతాధికారులను లోకాయుక్త ఆదేశించింది.

విచారణ జరిపిన అధికారులు రూ.58.62 కోట్లు విడుదల చేయాలని జిల్లా ట్రెజరీ అధికారులను తాజాగా ఆదేశించారు. దీంతో కేసును ముగించినట్టు లోకాయుక్త పేర్కొంది. కాగా త్వరలో బీఎల్‌వోలకు వేతనాలు అందనున్నాయి. బీఎల్‌వోలకు గౌరవ వేతనం విడుదలపై ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు, ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బూత్‌ స్థాయి అధికారులకు మూడేళ్లు గౌరవ వేతనం అందలేదన్నారు.

Next Story