రేపు పులివెందులకు వైఎస్‌ జగన్‌

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రేపు పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు.

By అంజి
Published on : 18 Jun 2024 4:00 PM IST

Former CM YS Jaganm Pulivendula, YCP, APnews

రేపు పులివెందులకు వైఎస్‌ జగన్‌

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రేపు పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం తాడేపల్లిలోని ఇంటికే పరిమితమైన ఆయన తొలిసారి బయటకు రానున్నారు. బుధవారం మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బయల్దేరి సాయంత్రంకల్లా అక్కడికి చేరుకుంటారు.

ఈ పర్యటనలో రాయలసీమ జిల్లాల నేతలు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. వారిని కలిసి భరోసా ఇవ్వనున్నారు. జూన్‌ 21 వరకు పులివెందులలోనే ఉండి, ఆరోజు సాయంత్రానికి తాడేపల్లికి తిరిగి చేరుకోనున్నారు. అనంతరం ఈ నెల 22న పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్‌ పాల్గొననున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన 175 మంది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, 25 మంది లోక్‌సభ అభ్యర్థులు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించనున్నారు.

Next Story