నేషనల్ కంపనీ లా ట్రిబ్యునల్(NCLT)లో ఏపీ మాజీ సీఎం జగన్ ఊరట లభించింది. తనతో పాట భార్య భారతీ పేరుతో ఉన్న వాటాలను అక్రమంగా తల్లి విజయమ్మ. చెల్లి వైఎస్ షర్మిల బదిలీ చేసుకున్నారని ఆరోపిస్తూ ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదిలీపై సుదీర్ఘంగా విచారణ జరిపిన ఎన్సీఎల్టీ.. జగన్ వాదనలతో ఏకీభవించింది. కాగా విజయమ్మ, షర్మిలకు బదిలీ అయిన వాటాలను నిలుపుదల చేస్తూ ఎన్సీఎల్టీ తీర్పు వెల్లడించింది. అయితే ఎన్సీఎల్టీ తీర్పుపై విజయమ్మ, షర్మిల హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది.