ర‌న్నింగ్ ట్రావెల్ బ‌స్సులో అగ్నిప్ర‌మాదం

Fire Broke out in a Private travel bus in Prakasam District.ప్ర‌కాశం జిల్లాలో పెను ప్రమాదం త‌ప్పింది. ప‌ర్చూరు మండ‌లం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Dec 2021 4:58 AM GMT
ర‌న్నింగ్ ట్రావెల్ బ‌స్సులో అగ్నిప్ర‌మాదం

ప్ర‌కాశం జిల్లాలో పెను ప్రమాదం త‌ప్పింది. ప‌ర్చూరు మండ‌లం తిమ్మ‌రాజుపాలెం వ‌ద్ద ఓ ప్రైవేటు ట్రావెల్ బ‌స్సులో మంట‌లు చెల‌రేగాయి. డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ప్రయాణీకుల ల‌గేజీతో పాటు బ‌స్సు పూర్తిగా కాలి ద‌గ్థ‌మైంది. వివ‌రాల్లోకి వెళితే.. ఆరెంజ్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్‌ నుంచి చీరాల వెలుతోంది. గురువారం తెల్లవారుజామున తిమ్మరాజుపాలెం వద్ద బస్సులో ఒక్కసారిగా మంటలు చెల‌రేగాయి.

వెంట‌నే అప్ర‌మ‌త్తం అయిన బ‌స్సు డ్రైవ‌ర్ బ‌స్సును నిలిపివేసి ప్ర‌యాణీకులను అప్ర‌మ‌త్తం చేశాడు. వెంట‌నే ప్ర‌యాణీకులు బ‌స్సులోంచి బ‌య‌ట‌కు దూకేశారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కి చేరుకున్నారు. ప్ర‌మాదంలో బ‌స్సుతో పాటు ప్ర‌యాణీకుల ల‌గేజీ పూర్తిగా కాలిపోయాయి. ప్ర‌యాణీకుల‌కు ఎటువంటి గాయాలు కాక‌పోవ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు బావిస్తున్నారు. కాగా.. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఇదిలావుంటే.. వ‌రుస బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌ల‌తో ఏపీ ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. నిన్న‌టి నుండి ఇది వ‌రుస‌గా మూడో ఘ‌ట‌న‌. నిన్న‌ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి.. వంతెనపై నుండి వాగులో పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌ సహా 9 మంది మృతి చెందారు. గురువారం ఉద‌యం గుంటూరు జిల్లా బాపట్ల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు కాల్వలోకి దూసుకెళ్లింది. కాకుమాను అప్పాపురం మార్గమధ్యంలో ఉన్న కాలువలోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రికి గాయాలు అయ్యాయి.

Next Story