AP: ఈ-ఆఫీస్ అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియ వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లోని గవర్నమెంట్‌ ఆఫీసుల్లో.. ఈ-ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌ను అప్ గ్రేడ్ చేసేందుకు ఎన్ఐసీ షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

By అంజి  Published on  17 May 2024 2:07 PM GMT
Election commission, e office upgrade, Andhrapradesh

AP: ఈ-ఆఫీస్ అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియ వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లోని గవర్నమెంట్‌ ఆఫీసుల్లో.. ఈ-ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌ను అప్ గ్రేడ్ చేసేందుకు ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్) ఈ నెల 18 నుంచి 25 వరకు షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ టైంలో ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్ సరికాదంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న రాష్ట్ర గవర్నర్‌కు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లెటర్‌ రాశారు. గవర్నమెంట్‌ డిపార్ట్‌మెంట్లలోని ఫైళ్ల భద్రతపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్‌ కార్యక్రమాన్ని వాయిదా వేసింది.

ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్‌పై ఎన్ఐసీ ప్రతినిధులతో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా మాట్లాడారు. విపక్షాల అభ్యంతరాలతో ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్ కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఎన్ఐసీకి సూచించారు. టెక్నికల్‌ ప్రాబ్లమ్స్‌ కారణంగా ఏపీలో ఈ-ఆఫీస్ అప్ గ్రేడేషన్‌ను వాయిదా వేస్తున్నట్టు ఎన్ఐసీ వెల్లడించింది. సాఫ్ట్ వేర్ అప్ గ్రేడేషన్ షెడ్యూల్ మరికొన్ని రోజుల తర్వాత విడుదల చేస్తామని ఎన్ఐసీ ప్రభుత్వ శాఖలకు సమాచారం చేరవేసింది. ప్రస్తుతం ఉన్న ఈ-ఆఫీస్ పాత వెర్షన్ తోనే విధులు నిర్వహించాలని ప్రభుత్వ శాఖలకు స్పష్టం చేసింది.

Next Story