అమరావతి: మెగా డీఎస్సీకి సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. 16,347 టీచర్ పోస్టులకు ఎల్లుండి నుంచి పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అభ్యర్థుల హాల్ టికెట్లపై ఫొటోలు లేకపోయినా తాజా ఫొటో, ఐడీని పరిశీలించి పరీక్షకు అనుమతించాలని విద్యాశాఖ ఆదేశించింది. నామినల్ రోల్స్లో తప్పుల సవరణకు సెంటర్ వద్దే అనుమతించాలంది. కంటి చూపు సరిగా లేని వారు, రెండు చేతులు లేని వారికి అదనంగా 50 నిమిసాల సమయం ఇవ్వాలని సూచించింది. దరఖాస్తులో హెల్పర్ పేరు లేకున్నా అక్కడికక్కడే ఏర్పాటు చేయాలంది. మెగా డీఎస్సీ పోస్టుల కోసం మొత్తం 3,53,598 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
అన్ని సబ్జెక్టులకు కలిపి మొత్తం 5,77,417 వరకు వచ్చాయి. అందులో కొంతమంది అభ్యర్ధులు రెండు, మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం కారణంగా ఇంత పెద్దమొత్తంలో దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్ధులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి 7013837359, 8121947387, 9398810958, 6281704160, 7995649286, 7995789286, 9963069286, 8125046997 ఈ నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులకు సూచించారు. dscgrievances@apschooledu.in ఐడీకి మెయిల్ కూడా చేయొచ్చని డీఎస్సీ కన్వీనర్ ఎం వెంకట కృష్ణారెడ్డి తెలిపారు.