ఏపీ కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు.. ఆరెండు జిల్లాల్లో మాత్రం

Curfew time changes in Andhra Pradesh.కరోనా కట్టడిలో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 July 2021 8:12 AM GMT
ఏపీ కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు.. ఆరెండు జిల్లాల్లో మాత్రం

కరోనా కట్టడిలో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు చేస్తూ సోమ‌వారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోదావ‌రి జిల్లాల్లో(తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ‌గోదావ‌రి) మిన‌హా మిగిలిన జిల్లాలో ఉద‌యం 6 నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు కర్ఫ్యూ ఆంక్షలను సడలించింది. ఇక గోదావ‌రి జిల్లాలో క‌రోనా పాజిటివిటీ రేటు ఇంకా త‌గ్గ‌ని కార‌ణంగా.. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్ర‌మే స‌డ‌లింపులు ఉంటాయ‌ని తెలిపింది.

సాయంత్రం ఆరు గంట‌ల‌కే దుకాణాల‌ను మూసివేయాల‌ని ఆదేశించింది. గోదావ‌రి జిల్లాలు మిన‌హా మిగిలిన జిల్లాలో రాత్రి 9 గంట‌ల‌కు దుకాణాలు మూసేయాల‌ని తెలిపింది. గోదావ‌రి జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం లోపు వ‌చ్చే వ‌ర‌కు ఈ ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ సడలింపులు జూలై 7 నుంచి అమలులోకి రానున్నాయి. కాగా.. కరోనా నిబంధనలను పాటిస్తూ 50శాతం ప‌రిమితితో రెస్టారెంట్లు, జిమ్‌లు, కళ్యాణమండపాలు తెరుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించాలని సూచించింది

Next Story