12న సీఎం జగన్‌ పల్నాడు జిల్లా క్రోసూరు పర్యటన

CM Jagan's visit to Palnadu District Krosur on 12th. ఈ నెల 12 న సీఎం జగన్‌ పల్నాడు జిల్లా క్రోసూరు పర్యటనకు వెళ్ల‌నున్నారు.

By Medi Samrat  Published on  10 Jun 2023 2:00 PM GMT
12న సీఎం జగన్‌ పల్నాడు జిల్లా క్రోసూరు పర్యటన

ఈ నెల 12 న సీఎం జగన్‌ పల్నాడు జిల్లా క్రోసూరు పర్యటనకు వెళ్ల‌నున్నారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుక పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి క్రోసూరు చేరుకుంటారు. అక్కడ ఏపీ మోడల్‌ స్కూల్‌ వద్ద పెదకూరపాడు నియోజకవర్గ వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించి, ప్రసంగం అనంతరం విద్యార్ధులకు కిట్స్‌ అందజేస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.


Next Story