17న సీఎం జగన్ నూజివీడు పర్యటన

సీఎం వైఎస్‌ జగన్ ఎల్లుండి ఏలూరు జిల్లా నూజివీడు పర్యటనకు వెళ్ల‌నున్నారు.

By Medi Samrat  Published on  15 Nov 2023 3:45 PM GMT
17న సీఎం జగన్ నూజివీడు పర్యటన

సీఎం వైఎస్‌ జగన్ ఎల్లుండి ఏలూరు జిల్లా నూజివీడు పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా 2003కు మందు అసైన్‌మెంట్‌ భూములకు హక్కు కల్పించడం, కొత్త అసైన్‌మెంట్‌ భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు.

17వ తేదీ ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి సీఎం నూజివీడు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగం అనంతరం 2003కు మందు అసైన్‌మెంట్‌ భూములకు హక్కు కల్పించడం, కొత్త అసైన్‌మెంట్‌ భూములకు పట్టాల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన‌ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Next Story