ఏపీ రూపు రేఖలను వైసీపీ సర్కార్‌ మార్చేసింది: సీఎం జగన్‌

గడిచిన 56 నెలల్లో తమ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రూపురేఖలను మార్చేసిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

By అంజి  Published on  14 Jan 2024 3:22 AM GMT
CM Jagan, YCP government, Andhra Pradesh

ఏపీ రూపు రేఖలను వైసీపీ సర్కార్‌ మార్చేసింది: సీఎం జగన్‌

గడిచిన 56 నెలల్లో తమ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రూపురేఖలను మార్చేసిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం అన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య క్లినిక్‌లు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ఇంగ్లీషు మీడియం పాఠశాలలు, బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాలతో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా 2.46 లక్షల కోట్లు పంపిణీ చేయడం ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్‌ రూపురేఖలు మారిపోయాయని ఆయన చెప్పారు.

రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు సీఎం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ విలువలు, సాంస్కృతిక మూలాధారాలకు అనుగుణంగా ప్రజలు స్వగ్రామాలకు తిరిగి వెళ్లే పెద్ద పండుగ సంక్రాంతి అని ఆయన సూచించారు. ఈ పండుగ సమయంలో భోగి మంటలు, రంగోలీలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాలు ఎగురవేయడం, పంటల పచ్చదనాన్ని ప్రజలు ఆస్వాదిస్తారని అన్నారు. డీబీటీ ద్వారా 2.46 లక్షల కోట్లు పంపిణీ చేయడాన్ని జగన్ మోహన్ రెడ్డి హైలెట్‌ చేసి చూపారు.

ఇంటింటికీ పాలన, రేషన్‌, పింఛన్‌లు, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ డోర్‌ డెలివరీ, వైద్యులు ఇంటింటికి వెళ్లి నాణ్యమైన వైద్యం అందిస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష నివారణ.. ఆరోగ్య సంరక్షణలో కొత్త అధ్యాయమని, ప్రభుత్వం ప్రజల ఇంటి వద్దకు వెళ్లి, వారి అనారోగ్యాలను తెలుసుకుని, చికిత్స అందజేస్తుందని ఆయన అన్నారు. ఈ పరివర్తనాత్మక అభివృద్ధి కార్యక్రమాలతో ఏపీ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతోందని సీఎం అన్నారు.

ఈ సందర్భంగా మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, అమబాటి రాంబాబు, జోగి రమేష్, సిహెచ్. వేణుగోపాలకృష్ణ, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, కొట్టు సత్యనారాయణ, ధర్మాన ప్రసాద రావు, ఆర్కే రోజా తదితరులు తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఆశీర్వదిస్తే భవిష్యత్తులో ఏపీలో మరింత అభివృద్ధి, అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఇదిలా ఉంటే.. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు.

Next Story