మచిలీపట్నంలో సీఎం చంద్రబాబు నాయుడు

మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2న మచిలీపట్నం రానున్నారు.

By అంజి  Published on  2 Oct 2024 4:35 AM GMT
CM Chandrababu Naidu, Machilipatnam, APnews

మచిలీపట్నంలో సీఎం చంద్రబాబు నాయుడు

మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2న మచిలీపట్నం రానున్నారు. సీఎం తన పర్యటనలో పారిశుధ్య కార్మికులతో ముచ్చటించడంతో పాటు పలు పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొంటారు. సీఎం రాక కారణంగా ఏర్పాట్లపై మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మచిలీపట్నంలో పర్యటించి పరిశీలించారు.

నగరంలోని నేషనల్ డిగ్రీ కళాశాల సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు ముఖ్యమంత్రి రానున్నారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా కళాశాల వెలుపల చెత్త తొలగింపును ఆయన పర్యవేక్షిస్తారు. అనంతరం డంపింగ్ యార్డును పరిశీలించి మూడు స్తంభాల సెంటర్ మీదుగా టీటీడీ కల్యాణ మండపానికి చేరుకుంటారు. కల్యాణ మండపం వద్ద పారిశుధ్య కార్మికులతో సీఎం నేరుగా మాట్లాడి వారికి దుస్తులు, రక్షణ సామాగ్రి పంపిణీ చేస్తారు.

Next Story