టీటీడీకి బాంబు బెదిరింపు కాల్.. పోలీసుల అదుపులో ఆక‌తాయి

టీటీడీకి బాంబు బెదిరింపు కాల్ రావ‌డం క‌ల‌క‌లం రేపింది.

By Medi Samrat  Published on  19 Aug 2023 2:13 PM GMT
టీటీడీకి బాంబు బెదిరింపు కాల్.. పోలీసుల అదుపులో ఆక‌తాయి

టీటీడీకి బాంబు బెదిరింపు కాల్ రావ‌డం క‌ల‌క‌లం రేపింది. అలిపిరి చెక్‌పోస్ట్ వ‌ద్ద‌ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందని.. బ్లాస్ట్ లో 100 మందికి పైగా భక్తులు చనిపోతారని అపరిచితుడు ఫోన్ కాల్ చేసి బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఈ మేర‌కు 15వ తేదీన ఉదయం 11.25 గంటలకు టీటీడీ కంట్రోల్ రూంకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ తో అప్రత్త‌మైన పోలీసులు.. అలిపిరి చెక్‌పోస్టు వద్ద పూర్తిస్థాయిలో తనిఖీలు చేప‌ట్టారు. అయితే.. భద్రతా సిబ్బంది తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్ధాలు లభించలేదు.


ఫోన్ కాల్‌పై టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి ఫోన్ కాల్ నకిలీదిగా గుర్తించారు పోలీసులు. నకిలీ ఫోన్ కాల్ చేసి అలజడి సృష్టించిన వ్యక్తిని సేలంకు చెందిన బాలాజీగా గుర్తించారు. వెంట‌నే పోలీసులు బాలాజీని ఆరెస్ట్ చేశారు. టీటీడీకి ఇబ్బంది కలిగించే వారిపైన, ఆకతాయి చేష్టలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని తిరుమల డిఎస్పీ భాస్కర్ రెడ్డి హెచ్చ‌రించారు.

Next Story