అమరావతి: రేపటి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే పదో తరగతి విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.
ఇంగ్లీష్ మీడియం, ఎన్సీఈఆర్టీ సిలబస్తో వచ్చే నెల వరకూ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. 3 వేల 450 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. హాల్ టికెట్ ఆధారంగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించింది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డీనరీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అధికారులు వీలు కల్పించారు. +ఈ ఏడాది పరీక్షలకు 6,49,275 మంది హాజరుకానున్నారు.
10వ తరగతి పరీక్షల షెడ్యూల్
మార్చి 17న ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్
మార్చి 21న ఇంగ్లిష్
మార్చి 22న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2
మార్చి 24న మ్యాథమెటిక్స్
మార్చి 26న ఫిజికల్ సైన్స్
మార్చి 28న బయోలాజికల్ సైన్స్
మార్చి 29న OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2, ఒకేషన్ కోర్స్ (థియరీ)
మార్చి 31న సోషల్ స్టడీస్