విషాదం.. బస్సు ఆపి గుండెపోటుతో ఏపీఎస్‌ఆర్టీసీ డ్రైవర్ మృతి

నెల్లూరు జిల్లాలోని కావలి నుండి బెంగళూరుకు వెళ్తున్న APSRTC బస్సు శుక్రవారం అన్నమయ్య జిల్లాలోని రాయచోటి శివార్లకు చేరుకున్నప్పుడు డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు.

By అంజి
Published on : 26 July 2025 6:52 AM IST

APSRTC, Driver Stops Bus, Cardiac Arrest, APnews

విషాదం.. బస్సు ఆపి గుండెపోటుతో ఏపీఎస్‌ఆర్టీసీ డ్రైవర్ మృతి

నెల్లూరు జిల్లాలోని కావలి నుండి బెంగళూరుకు వెళ్తున్న APSRTC బస్సు శుక్రవారం అన్నమయ్య జిల్లాలోని రాయచోటి శివార్లకు చేరుకున్న తర్వాత డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. అయితే, కావలి డిపోకు చెందిన డ్రైవర్ రసూల్ (50) బస్సును రోడ్డు పక్కన ఆపేసి, స్టీరింగ్‌పై కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన ప్రయాణికులు వెంటనే అంబులెన్స్ సర్వీసుకు సమాచారం అందించారు. హుటాహుటినా అక్కడి చేరుకున్న అంబులెన్స్‌లో డ్రైవర్‌ రసూల్‌ను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. ప్రత్యామ్నాయ డ్రైవర్ 25 మంది ప్రయాణికులను రాయచోటి డిపోకు తరలించారు. వారు ఈ ప్రమాదం నుండి అద్భుతంగా తప్పించుకున్నారు. అధికారులు ప్రయాణికులు బెంగళూరు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ బస్సును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.

Next Story