గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్
గ్రూప్-1 మెయిన్స్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది.
By అంజి
గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్
అమరావతి: గ్రూప్-1 మెయిన్స్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. మెయిన్స్ ఎగ్జామ్ ఆప్షన్ల మార్పునకు ఏపీపీఎస్సీ మరో ఛాన్స్ కల్పించింది. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 2 వరకు అభ్యర్థులు తమ మాధ్యమం, పోస్టులు, జోనల్ ప్రాధాన్యం, ఎగ్జామ్ సెంటర్ల మార్పు చేర్పులు వెబ్సైట్లో చేసుకోవచ్చని తెలిపింది. అలాగే పరీక్షల షెడ్యూల్ను రిలీజ్ చేసింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు మొత్తం 7 పేపర్లకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది.
పరీక్షల షెడ్యూల్
మే 3వ తేదీన తెలుగు పేపర్ (అర్హత పరీక్ష) పరీక్ష
మే 4వ తేదీన ఇంగ్లిష్ పేపర్ (అర్హత పరీక్ష) పరీక్ష
మే 5వ తేదీన పేపర్–1.. జనరల్ ఎస్సే పరీక్ష
మే 6వ తేదీన పేపర్–2.. భారతదేశ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర–సంస్కృతి, భూగోళిక అంశాలపై పరీక్ష
మే 7వ తేదీన పేపర్–3.. పాలిటీ,భారత రాజ్యాంగం, పాలన, లా అండ్ ఎథిక్స్ అంశాలపై పరీక్ష
మే 8వ తేదీన పేపర్–4.. భారత, ఆంధ్రప్రదేశ్ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి అంశాలపై పరీక్ష
మే 9వ తేదీన పేపర్–5.. సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ అంశాలపై పరీక్ష