1,620 ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఒక్కరోజే గడువు
రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో 1,620 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది.
By అంజి
1,620 ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఒక్కరోజే గడువు
అమరావతి: రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో 1,620 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు.. వారి విద్యా అర్హతలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్, కాపీయిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, ఫీల్డ్ అసిస్టెంట్, డ్రైవర్ తదితర ఖాళీలు ఉన్నాయి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి 7వ తరగతి నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ అభ్యర్థులు రూ.800, ఇతర అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాలి.
ఆఫీస్ సబార్డినేట్ – 651, జూనియర్ అసిస్టెంట్ – 230, కాపీయిస్ట్ – 193, స్టెనోగ్రాఫర్ – 80, ఫీల్డ్ అసిస్టెంట్ – 56, ఎగ్జామినర్ – 32, రికార్డు అసిస్టెంట్ – 24, డ్రైవర్ - 28, ప్రాసెస్ సర్వర్ – 164, టైపిస్ట్ – 162 పోస్టులు ఉన్నాయి. అర్హులు https://aphc.gov.in/recruitments.php వెబ్ సైట్ లోకి దరఖాస్తు చేసుకోవచ్చు. పార్ట్ ఏ, పార్ట్ బీలు.. రెండు పూర్తి చేయాల్సి ఉంటుంది. పార్టీ ఏ లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్, పార్ట్ బీలో అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
కోర్టు ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు ఉంటుంది. సమయం 90 నిమిషాలు కేటాయిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ తో పాటు తెలుగు మీడియంలోనూ ఇస్తారు. జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాల్డెజ్ ఆధారంగా ప్రశ్నలు ఇస్తారు. కొన్ని ఉద్యోగాలకు నైపుణ్య పరీక్ష కూడా రాయాల్సి ఉంటుంది. రాత పరీక్షలో ఈడబ్యూఎస్ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. ఇక బీసీ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు కనీసం 30 శాతం మార్కులు రావాల్సి ఉంటుంది.