బాపట్లలోని రెండు బీచ్‌లను మూసివేసిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలోని రెండు బీచ్‌లను స్థానిక పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు.

By అంజి  Published on  24 Jun 2024 3:00 PM GMT
AP Police, beaches, Bapatla, APnews

బాపట్లలోని రెండు బీచ్‌లను మూసివేసిన పోలీసులు

బాపట్ల: రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలోని రెండు బీచ్‌లను స్థానిక పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. గత వారంలో ఆరుగురు మునిగి మరణించిన తరువాత ప్రజలను సముద్ర తీరంలోకి ప్రవేశించకుండా నిషేధించారు. బాపట్ల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. గత వారం రోజుల్లో ఆరుగురు వ్యక్తులు నీటిలో మునిగి చనిపోయారని, ఫలితంగా సూర్యలంక, వాడ్రేవు బీచ్‌లలో పర్యాటకులు నీళ్లలోకి ప్రవేశించకుండా పోలీసులు నిషేధం విధించారని తెలిపారు.

"గత వారంలో, మేము 14 మందిని రక్షించగలిగాము, ఆరుగురు వ్యక్తులు సముద్రంలో మునిగిపోయారు. సంవత్సరంలో ఈ సమయంలో బీచ్ చాలా ప్రమాదకరమైనది" అని జిందాల్ పీటీఐకి చెప్పారు. కొంతమంది మోకాళ్ల లోతు వరకు మాత్రమే వెళ్లినప్పటికీ, వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండటం వల్ల ప్రాణాంతకంగా మారుతున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఈ ఏడాది సముద్రం మరింత ఉధృతంగా ఉందని, కొంతమంది బీచ్‌లకు వెళ్లేవారిని రక్షించవచ్చని.. అయితే పోలీసులు అన్ని చోట్లా ఎల్లవేళలా ఉండలేరని జిందాల్ చెప్పారు. 76 కి.మీ పొడవైన తీరప్రాంతంతో, బాపట్ల బీచ్‌లు రాష్ట్రంలో, వెలుపల నుండి అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి. వారాంతాల్లో దాదాపు 15,000 మంది సందర్శకులు వస్తారని జిందాల్ చెప్పారు.

Next Story