మంగళగిరి వాసులకు గుడ్‌న్యూస్..ఉచిత ఎలక్ట్రిక్ బస్సులకు మంత్రి లోకేశ్ శ్రీకారం

ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలను ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం ఉండవల్లి నివాసంలో జెండా ఊపి ప్రారంభించారు.

By Knakam Karthik  Published on  10 March 2025 5:29 PM IST
Andrapradesh, Free Electric Buses, Ap Minister Nara Lokesh, Mangalagiri

మంగళగిరి వాసులకు గుడ్‌న్యూస్..ఉచిత ఎలక్ట్రిక్ బస్సులకు మంత్రి లోకేశ్ శ్రీకారం

మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలను ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం ఉండవల్లి నివాసంలో జెండా ఊపి ప్రారంభించారు. సుదూర ప్రాంతాల నుంచి ఎయిమ్స్ హాస్పిటల్, పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్న విషయం మంత్రి లోకేశ్ దృష్టికి వచ్చింది. సీఎస్ఆర్ నిధుల నుంచి బస్సులను సమకూర్చాల్సిందిగా మేఘా ఇంజనీరింగ్ & ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను మంత్రి లోకేశ్ అభ్యర్థించారు. లోకేశ్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన MEIL ఫౌండేషన్ రూ.2.4 కోట్ల విలువైన రెండు అత్యాధునిక Olectra 7 మీటర్ల ఎలక్ట్రిక్ బస్సులను అందజేసింది.

ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్, డీజీపీ ఆఫీసు మీదుగా ఎయిమ్స్ కు నడుస్తుంది. మరొకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాలస్వామి గుడివరకు నడుస్తుంది. ఎయిమ్స్ కు వెళ్లే బస్సు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు... పానకాలస్వామి ఆలయానికి వెళ్లే బస్సు ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రయాణీకులకు ఉచితంగా సేవలందిస్తుంది. ప్రతి బస్సు 18 మంది ప్రయాణికుల సామర్థ్యంతో సింగిల్ ఛార్జింగ్ తో 150 కి.మీ. వరకు నడుస్తుంది. ఈ బస్సులు డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ ప్యానెళ్లు, ఎలక్ట్రానిక్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ (EHPS), రియల్-టైమ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ (VTS), రివర్స్ పార్క్ అసిస్ట్ సిస్టమ్స్ (RPAS) వంటి అత్యాధునిక సౌకర్యాలతో భద్రతా ప్రమాణాలు కలిగి ఉంటాయి.

Next Story