Andhrapradesh: ఇంటర్ ఫలితాలు విడుదల.. మార్కుల మెమో ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP) ఈరోజు, ఏప్రిల్ 12, 2025న ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (IPE) ఫలితాలను ప్రకటించింది.
By అంజి
Andhrapradesh: ఇంటర్ ఫలితాలు విడుదల.. మార్కుల మెమో ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP) ఈరోజు, ఏప్రిల్ 12, 2025న ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (IPE) ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లు - bie.ap.gov.in, resultsbie.ap.gov.in ద్వారా ఆన్లైన్లో వారి స్కోర్కార్డ్లను చూసుకోంచ్చు. స్కోర్ కార్డ్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ సంవత్సరం ఏపీలోఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1, 2025న ప్రారంభమై మార్చి 19న ముగిశాయి. రెండవ సంవత్సరం పరీక్షలు మార్చి 3న ప్రారంభమై మార్చి 20న ముగిశాయి. చివరి పేపర్లు మోడరన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ.
ఫలితాలను తెలుసుకోవడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి
- అధికారిక వెబ్సైట్ను సందర్శించండి: bie.ap.gov.in
- 1వ సంవత్సరం లేదా 2వ సంవత్సరం "ఏపీ ఇంటర్ ఫలితాలు 2025" అని చెప్పే లింక్పై క్లిక్ చేయండి.
- లాగిన్ విభాగంలో మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి.
- మీ ఫలితాలను వీక్షించడానికి సబ్మిట్పై క్లిక్ చేయండి.
- మార్కు షీట్ను డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోండి.
మన మిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా ఏపీ ఇంటర్ ఫలితాలు
- అధికారిక వెబ్సైట్లతో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే మన మిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా విద్యార్థులు తమ ఫలితాలను పొందవచ్చు.
- వాట్సాప్ తెరిచి 95523 00009 (మన మిత్ర కాంటాక్ట్) కు “హాయ్” అని పంపండి.
- ప్రతిస్పందన సందేశం నుండి “సేవను ఎంచుకోండి” పై నొక్కండి.
- మెను నుండి "విద్యా సేవలు" ఎంచుకోండి.
- ఫలితాలు చూసుకునేందుకు ఎంపిక కనిపిస్తుంది
- “ఫలితాలు” ఎంపికపై క్లిక్ చేసి, మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి.
- మీ మార్కులను తక్షణమే WhatsAppలో పొందండి.
ఆన్లైన్ మార్కుల మెమోలో సబ్జెక్టుల వారీగా స్కోర్లు ఉంటాయి. అధికారిక ఒరిజినల్ మార్క్ షీట్ల కోసం, ఆన్లైన్ ఫలితాల ప్రకటన తర్వాత కొన్ని రోజుల తర్వాత విద్యార్థులు తమ సంబంధిత కాలేజీల నుండి వాటిని తీసుకోవాలి. సప్లిమెంటరీ పరీక్షల గురించిన వివరాలను కూడా బోర్డు సకాలంలో విడుదల చేస్తుంది.