కల్లుగీత కార్మికులకు గుడ్ న్యూస్..దరఖాస్తు గడువు పొడిగించిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో కల్లు గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు దరఖాస్తుల గడువు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.

By Knakam Karthik  Published on  6 Feb 2025 6:33 AM IST
Andrapradesh, Tdp, Liquor Shops Applications,

కల్లుగీత కార్మికులకు గుడ్ న్యూస్..దరఖాస్తు గడువు పొడిగించిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో కల్లు గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు దరఖాస్తుల గడువు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 8వ తేదీ వరకు మద్యం షాపులకు అప్లికేషన్ చేసుకునేందుకు ఎక్సైజ్ శాఖ అవకాశం కల్పించింది, ఈ మేరకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 9వ తేదీన దరఖాస్తులు పరిశీలన చేపట్టనున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. 10వ తేదీన ఉదయం 9 గంటలకు దరఖాస్తులు డ్రా తీసి లబ్ధిదారుల వివరాలను జిల్లా కలెక్టర్లు ప్రకటించనున్నారు. అనంతరం మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 340 మద్యం షాపులను కల్లు గీత కార్మికుల కులాలకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.

Next Story