ఏపీలో ఈరోజు ఎన్ని కరోనా కేసులంటే..?
AP gets few more positive cases.ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.గడిచిన 24 గంటల్లో 44,382 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 158 మందికి పాజిటివ్గా నిర్థారణ అయింది.
By తోట వంశీ కుమార్ Published on
24 Jan 2021 2:28 PM GMT

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 44,382 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 158 మందికి పాజిటివ్గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,87,010కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 155 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 8,78,387కి చేరింది. ప్రస్తుతం 1,476 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 7,147 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 24, విశాఖ జిల్లాలో 22, కృష్ణా జిల్లాలో 20 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 2, కడప జిల్లాలో 4, కర్నూలు జిల్లాలో 6 కేసులు గుర్తించారు.
Next Story