'అన్నదాత సుఖీభవ' రైతులకు శుభవార్త

అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరో బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ నెల 20వ తేదీన తొలి విడత నగదు జమ చేస్తామని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.

By అంజి
Published on : 17 Jun 2025 7:20 AM IST

Annadatha Sukhibhav scheme, APnews, APGovt

'అన్నదాత సుఖీభవ' రైతులకు శుభవార్త

అమరావతి: అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరో బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ నెల 20వ తేదీన తొలి విడత నగదు జమ చేస్తామని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకం అర్హులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. అర్హులు అంతా ఈ కేవైసీ కోసం రైతు సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అర్హులైన 45.65 లక్షల మంది రైతుల్లో 44.19 లక్షల మంది వివరాలు ఆటో అప్డేట్‌ చేసినట్టు వెల్లడించారు. సరైన వివరాలు లేని 1.45 లక్షల మంది మాత్రమే వేలిముద్ర వేస్తే సరిపోతుంది.

ఈ మేరకు ఆ రైతులను వివరాలను రైతు సేవా కేంద్రాలకు పంపింది. ఈ నెల 20 కల్లా ఈ ప్రక్రియ పూర్తి కానుంది. పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు అందించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున జమ చేయనుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మొదటి రెండు విడతల్లో రూ.5 వేల చొప్పున, మూడో విడతలో రూ.4 వేలు అందించనుంది. ఈ నెల 20వ తేదీన రైతుల ఖాతాల్లో మొదటి విడతగా రూ.7 వేలు జమ చేయనున్నారు.

Next Story