నక్సల్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్..డీజీపీ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు నక్సల్ రహితంగా మారిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధికారికంగా ప్రకటించారు.

By -  Knakam Karthik
Published on : 30 March 2026 4:29 PM IST

AndhraPradesh, DGP, Naxal Free AP, Maoist Surrender, LWE, AOB, AP Police

నక్సల్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్..డీజీపీ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు నక్సల్ రహితంగా మారిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధికారికంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన మార్చి 31 గడువు సమీపిస్తున్న తరుణంలో, కీలకమైన మావోయిస్టు నేతలు పోలీసుల ఎదుట లొంగిపోవడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఏఓబీ రాష్ట్ర కమిటీ సభ్యుడు చెల్లూరు నారాయణరావు సహా మొత్తం తొమ్మిది మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. వీరిలో నారాయణరావు తలపై ₹25 లక్షల భారీ రివార్డు ఉండగా, మిగిలిన సభ్యులపై కూడా లక్షలాది రూపాయల రివార్డులు ఉన్నాయి. లొంగిపోయిన వారికి తక్షణ సాయంగా ₹20,000 అందజేయడంతో పాటు, వారి రివార్డు మొత్తాలను నేరుగా వారి ఖాతాలకే బదిలీ చేయనున్నట్లు డీజీపీ వెల్లడించారు.

ఇటీవల జరిగిన కాల్పుల్లో 18 మంది నక్సల్స్ హతం కావడం, మరో 50 మందికి పైగా సభ్యులను అరెస్టు చేయడం ద్వారా కోనసీమ, ఎన్టీఆర్ వంటి జిల్లాల్లో మావోయిస్టులు పన్నిన కుట్రలను పోలీసులు విజయవంతంగా భగ్నం చేశారు.

Next Story