విషాదం: విషవాయువులు లీకై ఇద్దరు మృతి

అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

By Knakam Karthik
Published on : 12 Jun 2025 9:32 AM IST

Andrapradesh, Anakapalli District,  Parawada Pharma City, Two Died

విషాదం: విషవాయువులు లీకై ఇద్దరు మృతి

అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు వెలువడి ఇద్దరు మృతి చెందారు. కాగా పరవాడ ఫార్మాసిటీలోని సాయి శ్రేయస్‌ ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. రసాయన వ్యర్థాల ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ వద్ద లెవెల్స్ చెక్ చేస్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఇద్దరు కంపెనీ సేఫ్టీ సిబ్బంది చంద్రశేఖర్, కుమార్ మృతి చెందగా, మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని ఆస్పత్రికి తరలించారు. రసాయన వాయువులు పీల్చడం వల్ల అపస్మారక స్థితికి వెళ్లినట్లు సమాచారం.

Next Story