అనంతపురం జిల్లాలో కరోనా కేసు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. అనంతపురం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది.

By అంజి
Published on : 5 Jun 2025 1:45 PM IST

Corona positive, Corona, Anantapur district, covid, apnews

అనంతపురం జిల్లాలో కరోనా కేసు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. అనంతపురం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది. నగరంలోని పాతూరుకు చెందిన ఓ మహిళకు జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చారు. ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు మహిళలకు కొవిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆస్పుపత్రిలో వైద్యం తీసుకోవాలని మహిళకు వైద్యులు సూచించారు. అందుకు ఆమె నిరాకరించగా హోం ఐసోలేషన్ లో ఉంచారు.

లక్షణాలు సాధారణంగా స్వల్పంగా ఉంటాయని, వైరస్ సోకిన వారు నాలుగు రోజుల్లో కోలుకుంటారని వైద్యులు తెలిపారు. కొన్ని సాధారణ లక్షణాలు జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి, తలనొప్పి, అలసట వంటివి ఉంటాయి.

Next Story