ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థినిపై ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులు!

పీహెచ్‌డీ విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని ఏయూ వైస్‌ఛాన్సలర్‌ని జాతీయ మహిళా కమిషన్‌ కోరింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 July 2023 6:00 AM GMT
PhD student, Andhra University, Vizag

ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థినిపై ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులు!

హిందీ విభాగానికి చెందిన పీహెచ్‌డీ విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) వైస్‌ఛాన్సలర్‌ పీవీజీడీ ప్రసాద రెడ్డిని జాతీయ మహిళా కమిషన్‌ కోరింది. తన పీహెచ్‌డీ థీసిస్‌పై సంతకం చేసేందుకు ప్రొఫెసర్ లక్షలు డిమాండ్ చేశారని విద్యార్థిని ఆరోపించింది. హిందీ విభాగం హెడ్ ప్రొఫెసర్ నల్ల సత్యనారాయణపై రీసెర్చ్ స్కాలర్ జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. పీహెచ్ డీ కావాలంటే తనతో బయటకు రావాలని వేధిస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై వర్సిటీ అధికారులు ఫిర్యాదును అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC), మహిళా గ్రీవెన్స్ సెల్‌కు పంపారు.

కొన్ని రోజుల క్రితం, హిందీ విభాగంలో పార్ట్‌టైమ్ రీసెర్చ్ స్కాలర్ జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) చైర్‌పర్సన్‌కు గైడ్ ప్రొఫెసర్ ఎన్ సత్యనారాయణ తనతో అనుచితంగా ప్రవర్తించాడని, డబ్బు కూడా డిమాండ్ చేశారని ఆరోపిస్తూ ఒక ఇమెయిల్ పంపింది. ప్రొఫెసర్ ఇతర మహిళలను కూడా లక్ష్యంగా చేసుకున్నారని విద్యార్థి ఆరోపించింది. ఆ మహిళ ఫిబ్రవరి 2019లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో చేరింది. అప్పటి నుంచి అతని డిమాండ్‌కు అనుగుణంగా పలు బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపింది. పరిశోధన కోసం తాను చాలా కష్టపడ్డానని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. మూడేళ్ల తర్వాత ఆ ప్రొఫెసర్ తన థీసిస్‌పై సంతకం చేసేందుకు రూ.4 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపించింది.

"గత సంవత్సరం ప్రొఫెసర్ ఫోన్ చేసి రూ. 2 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఆమె కెరీర్ నాశనం చేస్తానని బెదిరించాడు" అని పిహెచ్‌డి విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొంది. విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం, ప్రొఫెసర్ మొదట్లో వైవాకు ముందు రూ.75,000 అడిగారని, తర్వాత మిగిలిన మొత్తం అడిగారు. జనవరి 2023లో, పీహెచ్‌డీ విద్యార్థి ప్రొఫెసర్‌కి 75,000 రూ ఇచ్చానని చెబుతోంది. ప్రీ టాక్ వైవా కోసం సత్యనారాయణ రెండు లక్షలు డిమాండ్ చేశారని.. తాను రూ.75 వేలు ఇచ్చానని, ఆపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళా కమీషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో విద్యార్థిని ప్రస్తావించారుచింది. మిగిలిన డబ్బు ఇవ్వలేదంటూ తన భర్తపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి బ్లాక్ మెయిలింగ్‌కు దిగాడని ఆమె ఆరోపించింది. సత్యనారాయణ లైంగిక వేధింపులకు సంబంధించి యూనివర్సిటీ రిజిస్ట్రార్, వీసీకి ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని తెలిపింది.

అనుచితంగా ప్రవర్తించాడు:

ప్రొఫెసర్ తనను అనుచితంగా తాకుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అతను ఇతర మహిళలతో కూడా అనుచితంగా ప్రవర్తించేవాడు. వివిధ ప్రదేశాలలో తనను ఒంటరిగా కలవాలని కూడా కోరినట్లు ఆమె పేర్కొంది. తన థీసిస్‌ను సత్యనారాయణ సూచించిన ప్యానెల్‌కు కాకుండా వేరే ప్యానెల్‌కు పంపాలని విద్యార్థిని ఆంధ్రా యూనివర్సిటీని కోరింది.

ఈ ఆరోపణలను ఖండించిన ప్రొఫెసర్ సత్యనారాయణ:

ప్రొఫెసర్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, పీహెచ్‌డీ విద్యార్థిని తన థీసిస్‌పై పని చేయడానికి ఎప్పుడూ యూనివర్సిటీకి రాలేదని అన్నారు. "నేను 25 మంది పీహెచ్‌డీ స్కాలర్‌లకు గైడ్‌గా ఉన్నాను, ఎవరూ ఫిర్యాదు చేయలేదు. నిబంధనలకు విరుద్ధంగా ఆమె థీసిస్‌పై సంతకం చేయడానికి నేను నిరాకరించినందున ఆమె, ఆమె భర్త నాపై ఆరోపణలు చేశారు. అదే విషయాన్ని VCకి కూడా తెలియజేశాను. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ” అని ప్రొఫెసర్ అన్నారు.

చాలా మంది పీహెచ్‌డీకి ఫీజులు చెల్లిస్తున్నారని, చివరి క్షణంలో మాపై సంతకాలు చేయమని ఒత్తిడి తెస్తున్నారు. మేము నిబంధనకు విరుద్ధంగా వెళ్లలేమని చెప్పినప్పుడు, వారు మాపై అలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన మీడియాతో అన్నారు. మూడు నెలల క్రితం, థీసిస్‌పై సంతకం చేయమని తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, దాడి చేశాడని సత్యనారాయణ విశాఖపట్నంలోని III టౌన్ పోలీస్ స్టేషన్‌లో విద్యార్థిని భర్తపై ఫిర్యాదు చేశాడు.

15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరిన కమిషన్

పని ప్రదేశంలో లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం, పరిష్కారాలు) చట్టం, 2013 ప్రకారం చర్యలు తీసుకోవాలని NCW వీసీని కోరింది. 15 రోజుల్లోగా తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని కమిషన్ కోరింది. వర్సిటీ రిజిస్ట్రార్‌ వి.కృష్ణమోహన్‌ మీడియాతో మాట్లాడుతూ.. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఐసీసీ, మహిళా గ్రీవెన్స్‌ సెల్‌ని కోరామని తెలిపారు. ఆరోపణలు నిజమని తేలితే ప్రొఫెసర్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ తెలిపారు. పీహెచ్‌డీ విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు, మొదట సంబంధిత శాఖ ప్రిన్సిపాల్‌కు నివేదించాలని రిజిస్ట్రార్ సూచించారు.

Next Story