ఏపీలో క‌రోనా బులిటెన్ విడుద‌ల‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

997 New Corona Cases In AP. ఆంధ్ర‌ప్రదేశ్‌లో 24 గంట‌ల్లో 31,325 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 997 పాజిటివ్ కేసులు నిర్థార‌ణ

By Medi Samrat  Published on  29 March 2021 10:48 AM GMT
AP corona cases today

ఆంధ్ర‌ప్రదేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 31,325 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 997 పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయిన‌ట్లు వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన బులెటిన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుమ సంఖ్య 8,99,812కి చేరింది. అత్య‌ధికంగా చిత్తూరులో 181 కేసులు న‌మోదు కాగా.. అత్య‌ల్పంగా విజ‌య‌న‌గ‌రంలో 4 కేసులు న‌మోదు అయ్యాయి.

నిన్న ఒక్క రోజే 282 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా 8,86,498 మంది కోలుకున్నారు. క‌రోనా వ‌ల్ల అనంత‌పూర్‌, చిత్తూరు, క‌ర్నూల్‌, నెల్లూరు, విశాఖ‌ప‌త్నం జిల్లాల‌లో ఒక్కొక్క‌రు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,210కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 6,104 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 1,50,21,364 శాంపిల్స్‌ని ప‌రీక్షించారు.




Next Story