ఏపీ క‌రోనా బులిటెన్ విడుద‌ల‌.. భారీగా పెరిగిన కేసులు, మ‌ర‌ణాలు

New Corona Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్‌లో గ‌డిచిన‌ 24 గంటల్లో 39,619 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 9,716 కేసులు నిర్ధ‌రాణ అయ్యాయి

By Medi Samrat  Published on  21 April 2021 1:20 PM GMT
AP Corona cases

ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి క‌రాళ నృత్యం చేస్తోంది. గ‌త కొద్ది రోజులుగా ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. గ‌డిచిన‌ 24 గంటల్లో 39,619 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 9,716 కేసులు నిర్ధ‌రాణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన‌ పాజ‌టివ్ కేసుల సంఖ్య 9,86,703కు చేరింది. అత్య‌ధికంగా శ్రీకాకుళం జిల్లాలో 1,444 కేసులు న‌మోదు కాగా.. అత్య‌ల్పంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 106 కేసులు చొప్పున‌ న‌మోదు అయ్యాయి.

కోవిడ్ వల్ల నిన్న ఒక్క‌రోజే కృష్ణ లో పది మంది, నెల్లూరులో ఏడుగురు, తూర్పు గోదావరి లో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, చిత్తూర్ లో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, గుంటూరు లో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, అనంతపూర్ లో ఒక్కరు చొప్పున మొత్తం 38 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,510కి చేరింది. నిన్న ఒక్క రోజే 3,359 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 9,18,985కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 60,208 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,57,93,298 శాంపిల్స్ ను పరీక్షించారు.




Next Story