విజయవాడ డివిజన్‌లో తొమ్మిది రైళ్లు రద్దు

9 trains cancelled in Vijayawada Division due to maintenance works. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా విజయవాడ

By అంజి  Published on  9 Feb 2023 11:19 AM GMT
విజయవాడ డివిజన్‌లో తొమ్మిది రైళ్లు రద్దు

దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా విజయవాడ డివిజన్‌లో తొమ్మిది రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సిఆర్‌) గురువారం ప్రకటించింది . గురు, శుక్రవారాల్లో నడవాల్సిన విజయవాడ-బిట్రగుంట, విజయవాడ-గూడూరు రైళ్లను రద్దు చేశారు. అదేవిధంగా శుక్ర, శనివారాల్లో గుడూరు-విజయవాడ రైలును రద్దు చేశారు. శుక్రవారం కాకినాడ పోర్ట్-విశాఖపట్నం, విశాఖపట్నం-కాకినాడ పోర్ట్, విజయవాడ-ఒంగోలు రైళ్లను కూడా ఎస్‌సీఆర్‌ రద్దు చేసింది.

గురు, శుక్రవారాల్లో వెళ్లాల్సిన ఒంగోలు-విజయవాడ రైళ్లను కూడా రద్దు చేశారు. శుక్రవారం నడపాల్సిన బిట్రగుంట-చెన్నై సెంట్రల్, చెన్నై-సెంట్రల్-బిట్రగుంట రైళ్లు కూడా రద్దు చేయబడ్డాయి. కాకినాడ పోర్టు-విజయవాడ రైలును కాకినాడ పోర్ట్, రాజమండ్రి మధ్య శుక్రవారం పాక్షికంగా రద్దు చేసింది. విజయవాడ-కాకినాడ పోర్టు రైలు గురు, శుక్రవారాల్లో రాజమండ్రి-కాకినాడ పోర్టు మధ్య పాక్షికంగా రద్దు చేయబడింది.

ఇదిలా ఉంటే.. ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి ఎస్‌సీఆర్‌ సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను కూడా ప్రకటించింది. సికింద్రాబాద్-తిరుపతి ప్రత్యేక రైలు శుక్రవారం ఉదయం 20.10 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి శనివారం ఉదయం 9.00 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు ఆదివారం సాయంత్రం 4.35 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ రైళ్లు కాచిగూడ, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, ధోనే, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి. ఈ రైళ్లలో AC II టైర్, AC III టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని ఎస్‌సీఆర్‌ తెలిపింది.

Next Story