ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు
8987 New Corona Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 37,922 పరీక్షలు నిర్వహించగా.. 8,987 కేసులు నిర్ధరాణ అయ్యాయి.
By Medi Samrat
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 37,922 పరీక్షలు నిర్వహించగా.. 8,987 కేసులు నిర్ధరాణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజటివ్ కేసుల సంఖ్య 9,76,987కు చేరింది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 1,347 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 99 కేసులు చొప్పున నమోదు అయ్యాయి.
#COVIDUpdates: 20/04/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) April 20, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 9,74,092 పాజిటివ్ కేసు లకు గాను
*9,12,731 మంది డిశ్చార్జ్ కాగా
*7,472 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 53,889#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/jUBbsHtBl9
నిన్న ఒక్క రోజే నెల్లూరు జిల్లాలో ఎనిమిది మంది, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కడపలో జిల్లాలో ఐదుగురు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, కృష్ణలో ముగ్గురు, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పు గోదావరి, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 35 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,472కి చేరింది. నిన్న ఒక్క రోజే 3,116 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 9,15,626కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 53,889 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,57,53,679 శాంపిల్స్ ను పరీక్షించారు.