ఏపీ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని మ‌ర‌ణాలంటే..

896 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. రాష్ట్రంలో ఇవాళ కూడా కరోనా కేసులు

By Medi Samrat  Published on  12 Feb 2022 11:47 AM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని మ‌ర‌ణాలంటే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. రాష్ట్రంలో ఇవాళ కూడా కరోనా కేసులు సంఖ్య ఎనిమ‌ది వంద‌ల‌కుపైగా నమోదయ్యాయి. కరోనా మరణాలు కూడా కొన‌సాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 24,066 పరీక్షలు నిర్వహించగా.. 896 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు శ‌నివారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,12,029కి చేరింది.

క‌రోనా వ‌ల్ల నిన్న ఆరుగురు మృత్యువాత ప‌డ్డారు. కోవిడ్ వల్ల అనంతపురం లో ఇద్దరు, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు మరియు విజయనగరం లలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,694గా ఉంది. 24 గంటల వ్యవధిలో 8,849 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 22,72,881కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24,454 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,28,09,000 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Next Story