ఏపీలో ఈ రోజు ఎన్ని క‌రోనా కేసులంటే..?

79 New corona cases in AP.ఏపీలో గడచిన 24 గంటల్లో 26,526 కరోనా పరీక్షలు నిర్వహించగా 79 పాజిటివ్ కేసులు నిర్థ‌రాణ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Feb 2021 12:59 PM GMT
corona case in AP today

ఏపీలో గడచిన 24 గంటల్లో 26,526 కరోనా పరీక్షలు నిర్వహించగా 79 పాజిటివ్ కేసులు నిర్థ‌రాణ అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 8,89,156కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 16 మందికి కరోనా సోకింది. నెల్లూరు జిల్లాలో 12, అనంతపురం జిల్లాలో 11 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 77 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్నా వారి సంఖ్య 8,81,369కి చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో చికిత్స పొందుతూ ఒక వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,167కి చేరింది. కాగా.. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 1,36,70,612 న‌మూనాల‌ను ప‌రీక్షించిన‌ట్లు ప్ర‌భుత్వం బులెటిన్‌లో వెల్ల‌డించింది.



Next Story