క‌రోనా అప్‌డేట్‌.. రాష్ట్రంలో కొత్త‌గా ఎన్నికేసులంటే

76 New Covid-19 cases reported in Andhra Pradesh.ఏపీలో క‌రోనా మ‌హమ్మారి అదుపులోకి వ‌స్తోంది. గ‌త కొద్ది రోజులుగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 March 2022 12:47 PM GMT
క‌రోనా అప్‌డేట్‌.. రాష్ట్రంలో కొత్త‌గా ఎన్నికేసులంటే

ఏపీలో క‌రోనా మ‌హమ్మారి అదుపులోకి వ‌స్తోంది. గ‌త కొద్ది రోజులుగా రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య వంద‌లోపే న‌మోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 12,916 పరీక్షలు నిర్వహించగా.. 76 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు శ‌నివారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,18,338కి చేరింది. క‌రోనా కార‌ణంగా నిన్న ఎవ్వ‌రూ ప్రాణాలు కోల్పోలేదు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు 14,729 మంది మ‌ర‌ణించారు. 24 గంటల వ్యవధిలో 266 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 23,02,458కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,151 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,31,67,353 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

Next Story