ఏపీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా ఎన్నికేసులంటే..?
758 New corona cases in AP.ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో 35,196 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 758 మందికి కరోనా పాజిటివ్గా
By తోట వంశీ కుమార్ Published on 25 March 2021 12:19 PM GMT
ఏపీలో గత కొద్ది రోజులుగా రోజువారి కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 35,196 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 758 మందికి కరోనా పాజిటివ్గా వచ్చింది. అత్యధికంగా చిత్తూరులో 175 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 13 కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,95,879కి చేరింది. నిన్న ఒక్కరోజే చిత్తూరు జిల్లాలో ఇద్దరు, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి మృత్యువాత పడిన వారి సంఖ్య 7,201కి చేరింది.
#COVIDUpdates: 25/03/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) March 25, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,92,984 పాజిటివ్ కేసు లకు గాను
*8,82,314 మంది డిశ్చార్జ్ కాగా
*7,201 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3,469#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/yfWZ0iVbsR
ఇక ఒక్కరోజులో 231 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 8,85,209కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,469 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,48,75,597 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ తాజా బులెటిన్లో వెల్లడించింది.