ఏపీ క‌రోనా అప్‌డేట్‌.. మ‌ర‌ణాలు లేవు

70 New covid-19 cases reported in Andhra Pradesh.ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్టింది. గడిచిన 24 గంటల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2022 1:14 PM GMT
ఏపీ క‌రోనా అప్‌డేట్‌.. మ‌ర‌ణాలు లేవు

ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్టింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 11,408 పరీక్షలు నిర్వహించగా.. 70 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు బుధ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,18,617కి చేరింది. క‌రోనా కార‌ణంగా నిన్న ఎవ్వ‌రూ ప్రాణాలు కోల్పోలేదు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు 14,729 మంది మ‌ర‌ణించారు. 24 గంటల వ్యవధిలో 129 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 23,03,130కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 758 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,32,13,004 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

Next Story