ఏపీ క‌రోనా అప్‌డేట్‌.. ఈరోజు ఎన్నికేసులంటే..?

70 New corona cases in AP.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గడచిన 24 గంటల్లో 28,268 కరోనా పరీక్షలు నిర్వహించగా 70 పాజిటివ్ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Feb 2021 1:17 PM GMT
AP Corona cases

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గడచిన 24 గంటల్లో 28,268 కరోనా పరీక్షలు నిర్వహించగా 70 పాజిటివ్ కేసులు నిర్థ‌రాణ అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 8,89,409కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 19 మంది కరోనా బారినపడ్డారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 18 కొత్త కేసులు వెలుగు చూశాయి. విశాఖ జిల్లాలో 9, తూర్పు గోదావరి జిల్లాలో 9 కేసులు గుర్తించారు. కర్నూలు జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. కడప జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 84 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్నా వారి సంఖ్య 8,89,409కి చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఒక‌రు ప్రాణాలు కోల్పోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా మ‌ర‌ణించిన వారి సంఖ్య‌ 7,168కి చేరింది. కాగా.. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 1,37,75,253 న‌మూనాల‌ను ప‌రీక్షించిన‌ట్లు ప్ర‌భుత్వం బులెటిన్‌లో వెల్ల‌డించింది.





Next Story