ఏపీలో పెరిగిన క‌రోనా మ‌ర‌ణాలు

6582 New Corona Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్‌లో గ‌డిచిన‌ 24 గంటల్లో 35,922 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 6,582 కేసులు నిర్ధ‌రాణ అయ్యాయి.

By Medi Samrat  Published on  18 April 2021 12:37 PM GMT
corona virus

ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి క‌రాళ నృత్యం చేస్తోంది. గ‌త కొద్ది రోజులుగా ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. గ‌డిచిన‌ 24 గంటల్లో 35,922 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 6,582 కేసులు నిర్ధ‌రాణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన‌ పాజ‌టివ్ కేసుల సంఖ్య 9,62,037కు చేరింది. అత్య‌ధికంగా చిత్తూరు జిల్లాలో 1171 కేసులు న‌మోదు కాగా.. అత్య‌ల్పంగా ప‌శ్చిమ గోదావ‌రిలో 82 కేసులు న‌మోదు అయ్యాయి.

నిన్న ఒక్క రోజే చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో న‌లుగురు చొప్పున, క‌ర్నూల్‌ జిల్లాలో ముగ్గురు, గుంటూరు, అనంత‌పురం జిల్లాల్లో ఇద్ద‌రు చొప్పున‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 22 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,410కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,343మంది క‌రోనా నుంచి కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 9,09,941కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 44,686 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,56,77,992 శాంపిల్స్ ను పరీక్షించారు.




Next Story