ఏపీ కరోనా అప్డేట్.. కొత్తగా ఎన్నికేసులంటే..?
6341 New corona cases reported in AP.ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,07,764 శాంపిళ్లను
By తోట వంశీ కుమార్ Published on 18 Jun 2021 1:26 PM GMT
ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,07,764 శాంపిళ్లను పరీక్షించగా.. 6,341 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,39,243కి చేరింది. నిన్న 8,,486 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 17,59,390కి పెరిగింది.
#COVIDUpdates: 18/06/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) June 18, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,36,348 పాజిటివ్ కేసు లకు గాను
*17,56,495మంది5 డిశ్చార్జ్ కాగా
*12,224 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 67,629#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/XhdGfMdNqg
కోవిడ్ వల్ల చిత్తూరులో పన్నెండు మంది, గుంటూరులో ఎనిమిది, తూర్పుగోదావరిలో ఆరుగురు, కృష్ణలో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, అనంతపూర్లో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, కర్నూల్లో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు చొప్పున 57 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,224కి చేరింది. ఇక రాష్ట్రంలో 67,629 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,08,39,147 సాంపిల్స్ ని పరీక్షించారు.