ఏపీలో పెరిగిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

585 New corona cases in AP.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో 35,066 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 585 పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 March 2021 11:03 AM GMT
585 New corona cases in AP

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌త కొద్ది రోజులుగా రోజువారి క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 35,066 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 585 పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 8,95,121కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 168 కేసులు న‌మోదు అయ్యాయి. అదే సమయంలో 251 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్నా వారి సంఖ్య 8,84,978కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 2,946 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో న‌లుగురు కరోనాతో మృతి చెందారు. దీంతో ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 7,197కి చేరింది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 1,48,40,401 న‌మూనాల‌ను ప‌రీక్షించిన‌ట్లు ఆరోగ్య‌శాఖ బులెటిన్‌లో వెల్ల‌డించింది.



Next Story