ఏపీలో త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..?

54 New Corona cases in AP.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు త‌గ్గాయి. గడచిన 24 గంటల్లో 26,436 కరోనా పరీక్షలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Feb 2021 2:49 PM GMT
ఏపీలో త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు త‌గ్గాయి. గడచిన 24 గంటల్లో 26,436 కరోనా పరీక్షలు నిర్వహించగా 54 పాజిటివ్ కేసులు నిర్థ‌రాణ అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 8,89,210కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 19 మంది కరోనా బారినపడ్డారు. తూర్పు గోదావరి జిల్లాలో 6, కర్నూలు జిల్లాలో 6 కేసులు గుర్తించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 70 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్నా వారి సంఖ్య 8,89,210కి చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఎవ‌రూ ప్రాణాలు కోల్పోలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,167కి చేరింది. కాగా.. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 1,36,97,048 న‌మూనాల‌ను ప‌రీక్షించిన‌ట్లు ప్ర‌భుత్వం బులెటిన్‌లో వెల్ల‌డించింది.





Next Story