ఏపీలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

380 New corona cases in AP.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా బారిన ప‌డుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 March 2021 2:34 PM GMT
ఏపీలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా బారిన ప‌డుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 30,978 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 380 పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 8,93,366కి చేరింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 70 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 204మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్నా వారి సంఖ్య 8,84,094కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 2,083 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌ర్నూలు, ప్రకాశం జిల్లాలో ఒక్క‌రు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 7,189కి చేరింది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 1,47,05,188 న‌మూనాల‌ను ప‌రీక్షించిన‌ట్లు ప్ర‌భుత్వం బులెటిన్‌లో వెల్ల‌డించింది.






Next Story