ఏపీలో పెరిగిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..

3175 Covid-19 new corona cases reported in AP.నిన్న‌టితో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసుల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 July 2021 12:17 PM GMT
ఏపీలో పెరిగిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..

నిన్న‌టితో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 94,595 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 3,175 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,02,923 కి చేరింది. నిన్న 3,692 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,54,754కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూరులో ఆరుగురు, కృష్ణ‌లో ఐదుగురు, తూర్పుగోదావ‌రిలో న‌లుగురు, క‌ర్నూలులో ముగ్గురు, ప్ర‌కాశంలో ముగ్గురు, అనంత‌పురంలో ఇద్దరు, గుంటూరులో ఒక్క‌రు, క‌డ‌ప‌లో ఒక్క‌రు, నెల్లూరులో ఒక్క‌రు, శ్రీకాకుళంలో ఒక్క‌రు, విశాఖ‌ప‌ట్నంలో ఒక్క‌రు, ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఒక్క‌రు చొప్పున మొత్తం 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,844కి చేరింది. ఇక రాష్ట్రంలో 35,325 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,23,63,078 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story