ఏపీ కరోనా బులిటెన్.. మళ్లీ పెరిగిన కేసులు
3042 New Corona Cases Reported In AP. నిన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 88,378
By Medi Samrat Published on 6 July 2021 12:18 PM GMT
నిన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 88,378 శాంపిళ్లను పరీక్షించగా.. 3,042 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,08,065కి చేరింది. నిన్న 3,748 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,61,937కి పెరిగింది.
#COVIDUpdates: 06/07/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) July 6, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,05,170 పాజిటివ్ కేసు లకు గాను
*18,59,042 మంది డిశ్చార్జ్ కాగా
*12,898 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 33,230#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/qJsUQazZOx
కోవిడ్ వల్ల చిత్తూర్ లో ఏడుగురు, తూర్పు గోదావరి లో నలుగురు, నెల్లూరు లో నలుగురు, వైఎస్ఆర్ కడప లో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, గుంటూరు లో ఇద్దరు, పశ్చిమ గోదావరి లో ఇద్దరు, కృష్ణ లో ఒక్కరు, ప్రకాశం లో ఒక్కరు, శ్రీకాకుళం లో ఒక్కరు, విశాఖపట్నం లో ఒక్కరు చొప్పున మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,898కి చేరింది. ఇక రాష్ట్రంలో 33,230 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,25,24,187 సాంపిల్స్ ని పరీక్షించారు.